ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. గత కొంతకాలంగా జిల్లాలోని కాగజ్నగర్ మండలంలో ఉన్న చారిగాం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నది. అటవీ ప్రాంతంలో ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారాన్ని అటవీశాఖ సిబ్బందినికి చేరవేశారు. దీంతో పెద్దపులి పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు.