బుడ్డర్ఖాన్ల కుప్పిగంతులు చెల్లవు
దళిత మహిళను ఏఎంసీచైర్పర్సన్ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే
కేంద్ర వ్యవసాయ చట్టాలతో నష్టం
హుజూరాబాద్కు దండు కడదాం
టీఆర్ఎస్ గెలుపును ఏ శక్షీ ఆపలేదు
ఖమ్మం మార్కెట్కు కోల్డ్స్టోరేజీ మంజూరు
వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు కృషి
మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవ సభలో మంత్రులు సింగిరెడ్డి, పువ్వాడ
ఖమ్మం, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని మార్కెట్ కమిటీ పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్లకు రిజర్వేషన్ కల్పించి అన్నివర్గాల వారికి పదవులు లభించేలా చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. కేంద్రం ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు అన్యాయం జరుగనున్నదని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఖమ్మం మిర్చి మార్కెట్ను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కరణల ఫలితంగానే ఖమ్మం మార్కెట్ కమిటీకి చైర్పర్సన్గా దళిత మహిళకు అవకాశం లభించిందన్నారు. దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
పేదల పక్షపాతిగా, బడుగు, బలహీనవర్గాలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అనేక సంస్కరణలు రాష్ట్రంలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని మార్కెట్ కమిటీ పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్లకు రిజర్వేషన్ కల్పించి అన్నివర్గాల వారికి పదవులు లభించేలా చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. కేంద్రం ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు అన్యాయం జరుగనున్నదని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలు అమలయితే దేశంలో మార్కెటింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే ప్రధాన మార్కెట్లో ఒకటిగా ఉన్న ఖమ్మం వంటి వ్యవసాయ మార్కెట్పై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులకు కేంద్ర వ్యవసాయ చట్టాలతో ఉపాధి దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు.
మిర్చి మార్కెట్ను మరింత అభివృద్ధి చేస్తాం..
రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు వంటి పథకాలతో తెలంగాణలో వ్యవసాయం సుభిక్షమైందన్నారు. దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఖమ్మం మిర్చి మార్కెట్ను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజీ నిర్మించాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చేసిన విజ్ఞప్తికి మంత్రి నిరంజన్రెడ్డి స్పందించారు. తక్షణమే కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి అనుమతిస్తున్నామని, ఇందుకు ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతపై మంత్రి అజయ్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటానని అన్నారు. వ్యవసాయ కళాశాల మంజూరుకు మంత్రి అజయ్తో కలిసి సీఎంతో చర్చించి సానుకూల నిర్ణయం వెలువడేలా ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అదృష్టవంతులని, పట్టు వదలకుండా ప్రతి పనిలోనూ విజేయుడిగా నిలవడం ఈ అజేయుడికి మాత్రమే సాధ్యమైందని మంత్రిని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో మార్కెటింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని, రైతుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్ కమిటీలు పనిచేసేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు పూర్తిస్థాయి భరోసా అందించే రీతిలో మార్కెట్లు పని చేస్తాయన్నారు.
దళితులకు అండగా సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కరణల ఫలితంగానే ఖమ్మం మార్కెట్ కమిటీకి చైర్పర్సన్గా దళిత మహిళకు అవకాశం లభించిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో మాత్రమే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందని, హుజూరాబాద్లో జరిగే ఎన్నికకు ఖమ్మం నుంచి దండుకట్టాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదన్నారు. వ్యవసాయ, వాణిజ్య రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్కు కోల్డ్స్టోరేజీని మంజూరు చేయాలని, రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకుని ధర లభించినప్పుడు విక్రయించుకునే అవకాశం లభిస్తుందని మంత్రి పువ్వాడ కోరగా.. మంత్రి నిరంజన్రెడ్డి తక్షణం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మార్కెట్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి, ఢీకొనే సత్తా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకీ లేదన్నారు.
అంతరించిన పార్టీలకు ఏబుడ్డర్ఖాన్ అధ్యక్షుడైనా వాటి స్థితి పెరుగదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఎవరి కుప్పిగంతులు సాగవని మంత్రి పేర్కొన్నారు. నూతన పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉండి వారి సేవలో తరించాలని ఆకాంక్షించారు. సభలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, డైరెక్టర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ రైతులకు సేవచేసే మహోన్నత అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, మంత్రి పువ్వాడ అడుగుజాడల్లో రైతుల శ్రేయస్సుకు పాటుపడతానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, నగర పార్టీ అధ్యక్షుడు కమర్తపు మురళి, నగర మేయర్ కునుకొల్లు నీరజ, వర్తకసంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, వ్యాపార ప్రతినిధులు కొప్పు నరేశ్, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, నాయకులు నున్నా మాధవరావు తదితరులు పాల్గొన్నారు.