జగిత్యాల : తెలంగాణ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7 అంబెలెన్స్లను బుధవారం మంత్రి కేటీఆర్కు అందజేశారు. రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రూ.1.55కోట్ల విలువ గల ఏడు అంబులెన్స్లను తెలంగాణ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్కు అందజేశారు.
అనంతరం మంత్రి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు పర్వతనేని రమేష్, నాయకులు బోగ ప్రవీణ్, అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.