సిరిసిల్ల : వరద నీటిలో పడి మృతి చెందిన దినసరి కూలీ కుటుంబానికి అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన ఎర్రగుంట గంగకిషన్(35)అనే వ్యక్తికి భార్య సంధ్య, తల్లి లక్ష్మి, కొడుకు రాము(12), కూతురు లహరిలు ఉన్నారు. గంగకిషన్ దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం వరదనీటిలో పడిపోగా బైపాస్రోడ్డు ప్రాంతంలో మృతదేహం లభించింది. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ సూచనతో అంత్యక్రియల కోసం మున్సిపల్ ద్వారా రూ.20వేలు ఖర్చులు అందించారు.
విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం ద్వారా రూ.4లక్షలు మంజూరు చేయగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, చైర్పర్సన్ జిందం కళ, ఆర్డీవో శ్రీనివాస్రావు, తహశీల్దార్ విజయ్, కమిషనర్ వెల్దండి సమ్మయ్యలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు.
చైర్పర్సన్ జిందం కళ తన వంతు సహాయంగా రూ.10వేలు నగదుతో పాటు నెలకు సరిపడా నిత్యవసర సరుకులను వారికి అందించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ గంగకిషన్ మృతి విచారకరమన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి మంత్రి కేటీఆర్ అందించిన సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, మున్సిపల్ కౌన్సిలర్లు అడ్డగట్ల మాధవి, రాపెల్లి దినేష్, నాయకులు అడ్డగట్ల మురళి, తదితరులు ఉన్నారు.