కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేటలో విషాదం నెలకొన్నది. కోనరావుపేట మండలంలోని కొలనూర్ గొల్లపల్లిలో విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన సూర సత్తయ్య (43) అనే రైతు తెల్లవారుజామున తన పొలం వద్ద కరెంటు పెట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో స్టాటర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రాజేశ్వరి, కొడుకు తరుణ్, కూతురు కీర్తన ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజశేఖర్, సెస్ ఏఈ పృద్వీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.