చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దారుణం జరిగింది. గంగారం అనే 70 ఏళ్ల వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి బండ రాయితో కొట్టి చంపారు. మృతుడు గంగారాం స్థానిక హోటల్లో పని చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టామని చెప్పారు.