కరీంనగర్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ రాజన్న సిరిసిల్ల, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన రామన్నకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతోపాటు, నేతన్నల బతుకు చిత్రం మార్చారు. 50ఏండ్లలో జరుగని అభివృద్ధిని కేవలం తొమ్మిదిన్నర ఏండ్లల్లో చేసి చూపించారు. తాగు, సాగునీటి గోస తీరింది. కళ్ల ముందు కనిపిస్తున్న ప్రగతిని చూస్తున్న ప్రజలంతా ఈఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి ఐదోసారి అసెంబ్లీకి వంపించాలన్న పట్టుదలతో తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు.
మంగళవారం సిరిసిల్లలో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో పార్టీ అధినేత, ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ సమక్షంలో 18 సంఘాలు, నాలుగు అసోసియేషన్స్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కాపీలను ఆయా సంఘాల అధ్యక్షులు రామన్నకు అందించారు. ఆయా సంఘాల అధ్యక్షులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సీఎం కేసీఆర్కు పరిచయం చేశారు. పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూర అంజిరెడ్డి, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, జిల్లా గౌడ సంఘం పక్షాన అధ్యక్షుడు బుర్ర నారాయణగౌడ్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్, జిల్లా వెలుమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కాల రామారావు,
జిల్లా రజక సంఘం అధ్యక్షుడు దుబ్బాక రమేశ్, జిల్లా నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, జిల్లా శాలీవాహన సంఘం అధ్యక్షుడు నెల్లుట్ల కనకయ్య, జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, జిల్లా మోతే సంఘం అధ్యక్షుడు ఓటారికారి దేవేందర్, జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి, జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మండల సత్యం, పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, సిరిసిల్ల టెక్స్టైల్స్పార్క్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్, సిరిసిల్ల మసీదు కమిటీ అధ్యక్షుడు ఎండీ సలీం, జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కత్తెర దేవదాస్, జిల్లా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు అజ్మీరా రాజునాయక్, జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మీరాల భాస్కర్, జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కోడి అంతయ్య తీర్మాణ కాపీలను కేటీఆర్కు సభావేదికపైన అందజేశారు. సంఘాల ద్వారా తనకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేసిన కుల సంఘాల సభ్యులందరికీ రామన్న కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ ఎలగందుల రమణ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, చొప్పదండి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, అధికార భాషా అధ్యక్షుడు మంత్రి శ్రీదేవి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, చీటి నర్సింగరావు, పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకుడు బొల్లి రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.