సిరిసిల్ల రూరల్, ఆగస్టు 3: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో విఫలమయిందని కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలను పూర్తిగా మోసం చేసిందని, ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాన్నారు. తంగళ్ళల్లి మండలం ఓబులాపూర్ కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షునిగా వోడ్నాల మహేష్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ యువతను చైతన్య పరిచి, గ్రామ గ్రామాన కేటీఆర్ సేనను బలోపేతం చేస్తామన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన సంక్షేమ పథకాలను గడప గడపకు వివరీస్తామని చెప్పారు. ఏ ఎన్నిక వచ్చినా కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దోమల కొమురయ్య, కొత్త సంతోష్ గౌడ్, గోగు మల్లేశం,బొమ్మ దేవయ్య, నందగిరి నాగరాజు, నందగిరి సురేందర్, దోమల హరీష్, దోమల వంశీ, వోడ్నాల శ్రీకాంత్, తొట్ల శివాజీ, పోచంపల్లి కిషన్, పోచంపల్లి నితిన్, పరుస ప్రశాంత్, పరుస నవీన్, గుగ్గిళ్ళ ప్రశాంత్, అల్వాల చింటూ, కొత్త అజయ్ తదితరులు పాల్గొన్నారు.