సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలంలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. మండలంలోని దేగవత్ తండాకు చెందిన కున్సోత్ గంగాధర్పై బుధవారం తెల్లవారుజామున ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆయన తల, చేతులపై తీవ్రంగా గాయాలయ్యాయి. తమ ఆవుల మంద నుంచి రెండు ఆవులు తప్పిపోయాయని, వాటిని అడవిలో వెతుకుతుండగా ఎలుగుబంటి దాడి చేసిందని గంగాధర్ కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను జగిత్యాల జిల్లాలోని ప్రైవేటు దవాఖానకు తరలించామన్నారు.