రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా జిల్లాలోని వేములవాడ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన చంద్రగిరి రాజేశం( 50 ) వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..రాజేశం తన పొలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వడదెబ్బ తగలడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.