జ్యోతినగర్, జూన్ 13 : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన ఎన్టీపీసీ పట్టణ పరిధి రెండో డివిజన్ పీకే రామయ్యకాలనీలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాలనీలోని పబ్లిక్ కరెంట్ మోటర్ నుంచి నీటి సరఫరా అనంతరం తిరిగి మోటర్కు అమార్చిన విద్యుత్ వైర్ ప్లగ్గును తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి పాలవేణి స్వప్న (29) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.
మృతురాలికి భర్త మహేశ్, ఇద్దరు కుమార్తెలు సాత్విక, లాస్య ప్రియలు ఉన్నారు. స్వప్న మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎన్టీపీసీ ఏఎస్ఐ చక్రపాణి కేసునమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.