Godavarikhani | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరేణి కార్మికులు ప్రయాణిస్తున్న ఓ కారు అతివేగంతో వచ్చి రాజేశ్ థియేటర్ వద్ద ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. దీంతో కారులోనే వారంతా ఇరుక్కుపోయారు. ఇది గమనించిన స్థానికులు.. కారులోని వారిని బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్ల్లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.