Makkan Singh Raj Thakur | కోల్ సిటీ , ఏప్రిల్ 30 : రామగుండం నగర పాలక సంస్థ 33వ డివిజన్ పరిధి పరశురాంనగర్లో ఇవాళ పరశురాముడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పరశురాముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షయ తృతీయ రోజున పరశురాముడి జయంతి జరుపుకోవడం ఆనవాయితీ అని, మహా విష్ణువు ఆరవ అవతారం పరశురాముడు చాలా క్రోధ స్వభావి అని అన్నారు. పరశురాముడు సృష్టి చివరి వరకు భూమిపై అమరుడిగా ఉంటాడని పేర్కొన్నారు. రాముడుగా ఉన్న ఆయనకు మహదేవ్ ఆయుధ కళ నేర్పిన తర్వాత శివుడు సంతోషించి గొడ్డలి ఇవ్వడంతో పరశురాముడిగా అవతరించాడని అన్నారు.
ఆ మహనీయుడి పేరుతో ఉన్న పరశురాంనగర్ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని బస్తీ ప్రజలకు హామీ ఇచ్చారు. డివిజన్ ఇంఛార్జి బండి రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొంతల రాజేష్, ఎండీ ముస్తఫా, పెద్దెల్లి తేజస్వి ప్రకాశ్, బస్తీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం