మంథని రూరల్, మే 9 : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని మూడు బజారుల దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాతిర రెండు నల్ల పిల్లులను బలివ్వడంతో పాటు వాటి చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, జీడిగింజలు పెట్టారు.
తెల్లవారుజామున అది గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో క్షుద్ర పూజలు చేసే వారిని పట్టుకొని, ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు.