పెద్దపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఓ లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద లారీ బైక్ను ఢీ కొట్టడంతో రామగుండం ఇరిగేషన్ డివిజన్లో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న కాసర్ల సురేష్ కుమార్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.