TG Tenth Results | కాల్వ శ్రీరాంపూర్, ఏప్రిల్ 30 : ఇవాళ వెలువడిన పదవతరగతి ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. మండలంలో మొత్తం 11 హైస్కూల్స్, 1 కేజీబీవీ, 1 మోడల్ స్కూల్ ఉండగా.. కూనారం, మంగపేట, పందిల్ల గంగారం, తారుపల్లి, మొట్లపల్లి పాఠశాలల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో మహేశ్ తెలిపారు.
మల్యాల మోడల్ స్కూల్లో ఆర్ సహస్ర వర్షిణి 564, ఏ కావ్య 563 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచారు. మొత్తం 309 మంది విద్యార్థులకుగాను 302 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 97.7 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘం నేతలు అభినందించారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం