పెద్దపల్లి : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. శనివారం పెద్దపల్లి మండలం కాపులపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో.. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ వంటి పథకాలతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధి సాధిస్తుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయన్నారు.
పని చేసే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇన్నేండ్లలో జరిగిన అభివృద్ధిని పరిశీలించి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.