జూలపల్లి, ఏప్రిల్ 2 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ లోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం తెల్లవారుజామున ‘గిరి ప్రదక్షిణ’ ప్రారంభించారు. వేద పండితులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణం కోసం గిరి ప్రదక్షిణ ఎంతో శ్రేష్టమైందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి గిరి ప్రదక్షిణలు చేసి దేవతామూర్తులను దర్శించుకున్నారు.
ప్రతి నెల పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణలు చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు తొగరు శ్రీనివాస్, దండె వెంకటేశ్వర్లు, నాంపల్లి సంపత్ కుమార్, మాజీ సర్పంచ్ గొట్టెముక్కుల రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గొ ట్టెముక్కుల రజని తదితరులు పాల్గొన్నారు.