Fog in Peddapalli | ఓదెల, జనవరి 19: పెద్దపల్లి జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు కమ్మేసి.. 10 మీటర్ల దూరంలోని ప్రాంతం కూడా కనిపించడం లేదు. మొత్తం మంచు కప్పేసి ఉండటంతో ఢిల్లీని తలపిస్తోంది.
పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే సిగ్నల్స్ కనిపించకపోవడంతో లోకోపైలట్లు రైళ్ల వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వెళ్తున్నారు. చల్లటిగాలులు వీస్తుండటంతో ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, ఆస్తమా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, పనులు చేసుకునేవారు స్వెటర్లు ధరించి బయటకు వెళ్తున్నారు.

Peddapalli2