కోల్ సిటీ, ఏప్రిల్ 29: రామగుండం నియోజక వర్గంలోని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్లు తమ పేరును 2002 ఓటరు జాబితాలోని పేరుతో మ్యాపింగ్ చేసుకోవాలని ఈఆర్ ఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తెలిపారు. 2002 సంవత్సరం తర్వాత జన్మించి ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లు తల్లిదండ్రులతో గాని, తాత, నానమ్మలతో గాని మ్యాపింగ్ చేసుకోవాలని తెలిపారు.
ఇందుకోసం తమ ప్రాంతంలోని బీఎల్ఓ లను సంప్రదించి మ్యాపింగ్ చేసుకోవాలని, బీఎల్ ఓల వివరాల కోసం రామగుండం తాసీల్దార్ కార్యాలయం గానీ, ఆన్లైన్ వెబ్ సైట్ http://ceotsems2. Telangana.gov. in/TS_ERODETAILS /BLO _Details. Aspx ద్వారా గాని తెలుసుకొని మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు.