జగిత్యాల : జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనంద్ రావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద స్వరం శతాబ్దం దాటిన నేటికి ఆ మాటలు యువకుల హృదయంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ బాధ్యులు మహేష్ శ్రీనివాసరెడ్డి, రాజేష్, రాజగోపాల్, బొమ్మ కంటి శ్రీనివాస్, భూపాల్ రావు, రత్నాకర్ రావు, రాజేందర్ రావు, హరీష్ సిహెచ్, పి శ్రీనివాస్, దేవేందర్, శ్రీనివాస్, ఆత్మ చరణ్ రావు, అశోకరావు, వేణుగోపాల్, అనిల్ రావు, గంగారెడ్డి, విజయ్, తదితరులు పాల్గొన్నారు.