జగిత్యాల : కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) అన్నారు. నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలంలో జడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ తో కలిసి శనివారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నుంచి ప్రభుత్వం తప్పుకుంటుందని విమర్శించారు.
ఆరు గ్యారంటీలలో (Six Guarantees) యువతకు మొండి చేయి చూపిందని ఆరోపించారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకారం యువ వికాసం పథకాన్ని ప్రజాపాలన (Praja Palana) లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దరఖాస్తులు లేకుండా సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని సూచించారు.
ప్రోటోకాల్ విషయంలో కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించడం శోచనీయమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క పథకానికి కూడా కేంద్రం సహాయ, సహకారాలు అందించ లేదని పేర్కొన్నారు. కేసీఆర్ (KCR ) నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచిందని వెల్లడించారు.