జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కుల వృత్తులకు ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణం 10వ వార్డులో గంగపుత్ర సంఘం భవన నిర్మాణానికి రూ.5 లక్షల ప్రొసీడింగ్ కాపీని గంగపుత్ర సంఘ సభ్యులకు ఎమ్మెల్యే క్వార్టర్లో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కుల, మతాలకు అతీతంగా పాలన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సిరికొండ భారతి, అరుముళ్ల నర్సమ్మ, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.