జగిత్యాల : దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే దళిత బంధు అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండల మంగెల గ్రామానికి చెందిన రాస శంకర్, తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన సదాల అశోక్ కి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన మహీంద్రా కంపెనీ గూడ్స్ వాహనాలను గురువారం లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే కన్న కలలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు.
దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దళిత బంధు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ నిరంతరం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.
దళితులు దళిత బంధును సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, జిల్లా కేఈసీసీ మెంబర్ ముప్పాల రామ్ చందర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు నారపాక రమేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.