జగిత్యాల : జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ మహాత్మ జ్యోతిభా పులే బాలికల గురుకుల పాఠశాలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో గల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదివి తమ కలలను నిజం చేసుకోవాలన్నారు. అలాగే పట్టుదలగా చదివి గొప్ప వారు కావాలని రాష్ట్రం, దేశం కీర్తి పెంచాలని ఆకాంక్షించారు.
అనంతరం రక్షా బంధన్ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యేకి రాఖీ కట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ సునీత, ఆత్మ కమిటీ చైర్మెన్ రాజిరెడ్డి, నాయకులు సత్తిరెడ్డి,చంద్రారెడ్డి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.