జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ వివాహిత మృత్యువాత పడింది. ఈ విషాదకర సంఘటన మెట్పల్లి మండలం వెల్లుల్లలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన కన్నూరి కావ్య (24) అనే వివాహిత ఆదివారం ఉదయం ఇంట్లో బోరు మోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురైంది.
గమనించిన కుటుంబ సభ్యులు కావ్యను మెట్పల్లి దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతిరాలికి భర్త సాగర్, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కావ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.