కోరుట్ల : సీఎంఆర్ఎఫ్ నిరుపేదల పాలిట వరంగా మారిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మంగళవారం కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 64 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
అలాగే పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశారు. 100 పడకల దవాఖాన పనులను పర్యవేక్షించి గుత్తేదారుకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదలకు ఆపత్కాలంలో సీఎంఆర్ఎఫ్ సంజీవని వలే పని చేస్తుందన్నారు.
టీఆర్ఎస్ పాలనలోనే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.