జగిత్యాల : అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. గురువారం భూపతిపూర్ గ్రామంలోని బీజేపీ పార్టీకి చెందిన 20 మంది యువకులు ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ కొల్లూరి వేణు, పృథ్వీ రాజ్, శ్రీకాంత్ ,సోమయ్య, కౌన్సిలర్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పంబాల రామ్ కుమార్, దుమాల రాజ్ కుమార్,అంజయ్య, మేక పవన్, నర్సయ్య,త దితరులు పాల్గొన్నారు.