జగిత్యాల రూరల్, డిసెంబర్ 24: రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నాలపై అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. రైతాంగ సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఉద్ఘాటించారు. శనివారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి అమ లు చేస్తున్న పథకాలతో సాగు విస్తీర్ణం పెరిగిందని, గతంలో 69 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే, నేడు 2,40,000 మెట్రి క్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పన్నులు చెల్లిస్తే అందులో నుంచి కేంద్రం రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాలకు నిధులను సమకూరుస్తున్నదన్నారు. జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకంతో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని, గత ప్రభుత్వాల హయాంలో ఇన్ని పనులు జరగలేదని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం నిధులతో రైతు కల్లాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే కేంద్రం అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు.
తెలంగాణకు హకుగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వడం లేదని, ఢిల్లీ కేంద్రంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశామని ఉటంకించారు. పార్లమెంట్లోనూ బీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తున్నారని చెప్పారు. తాము స్థానికంగా నిరసనలు తెలపడంపై ఎమ్మె ల్సీ జీవన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడడం సరైంది కాదని సూచించారు. విశేష అనుభవమున్న, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని, తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను కొంద రు నాయకులు కావాలని బద్నం చేస్తున్నారన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు నకల రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ ముసు నారాయణ రెడ్డి, నాయకులు మోహన్ రెడ్డి, రిజ్వాన్తోపాటు పలువురు నాయకు లు పాల్గొన్నారు.