జగిత్యాల : వరద నీటిలో గల్లంతైన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ జమీర్ మృతదేహం ఆచూకీ దొరికింది. వాగు నుంచి ఒక కిలో మీటరు దూరంలో చెట్ల పొదల్లో జమీర్ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసి జమీర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఆప్ప చెప్పేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమీర్ మృతి ఎంతో బాధాకరం అన్నారు. జమీర్ వార్తల సేకరణలో ఎంతో కృషి చేసేవారని..ఆయన మృతి మీడియా రంగానికి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా వారి కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీనిచ్చారు.