అర్హులందరూ టీకా వేయించుకోవాలి
చొప్పదండి ఎంపీపీ రవీందర్
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
చొప్పదండి, ఏప్రిల్12: కరోనా సెంకడ్ వేవ్ ఉధృ తి నేపథ్యంలో 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని వైరస్ కట్టడికి సహకరించాలని ఎంపీపీ చిలుక రవీందర్ సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. సెం టర్కు వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చిన వారికి కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. నీటి వసతి కల్పించాలని, సిబ్బంది సంఖ్యను పెంచాలని, టీకాపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారి రమాదేవికి సూచించారు. ఆయన వెంట మండల ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సింగిరెడ్డి కిష్టారెడ్డి, ఎంపీడీవో స్వరూప, సూపరింటెండెంట్ వేణుగోపాల్, సీహెచ్వో ప్రసాద్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
185 మందికి వ్యాక్సిన్
గంగాధర, ఏప్రిల్ 12: గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 185 మందికి వ్యాక్సిన్ వేసినట్లు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుజాత తెలిపారు. 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్రావు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అట్ల రాజిరెడ్డి, సర్పంచులు వేముల దామోదర్, రామిడి కనుకమ్మ, ఆకుల శంకరయ్య, నాయకులు దూలం శంకర్గౌడ్, రామిడి సురేందర్ తదితరులు వ్యాక్సిన్ తీసుకున్నారు.
రామడుగులో 246 మందికి..
రామడుగు, ఏప్రిల్12: మండలవ్యాప్తంగా సోమవారం 246 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. గోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 96 మందికి రామడుగు ప్రాథమిక ఆ రోగ్య కేంద్రంలో 150 మంది టీకా వేయించుకున్నారు. గోపాల్రావుపేట పీహెచ్సీలో మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, దేశరాజ్పల్లి ఎంపీటీసీ వంచ మహేందర్రెడ్డి టీకా తీసుకున్నారు. రామడుగు పీహెచ్సీ పరిధిలో 72 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్గా తేలినట్లు వైద్యులు తెలిపారు. గోపాల్రావుపేట పీహెచ్సీ పరిధిలో 130 మందికి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. గోపాల్రావుపేటలో 9, రాంచంద్రాపూర్ 1, వన్నారం 1, కొక్కెరకుంట 1, తిర్మలాపూర్ 1, రామడుగు 1, చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లిలో 2 మొత్తం 16 మంది కరోనా బారిన పడ్డారని వెల్లడించారు.
కరీంనగర్ రూరల్: కరీంనగర్ మండలంలోని కొత్తపల్లి పీహెచ్సీలో టీఆర్ఎస్ నేత బల్మూరి జగన్మోహన్రావు, జూబ్లీనగర్ మాజీ సర్పంచ్ రుద్ర రాములు, గ్రామ కార్యదర్శి, ఎంపీవో రాజా గోపాల్రెడ్డి, వార్డు సభ్యులు, మండల కో ఆప్షన్ సభ్యుడు సర్వర్పాషా, బుర్ర రమేశ్గౌడ్, గోపాల్పూర్, ఇరుకుల్ల, దుర్శేడ్, వివిధ గ్రామాల పారిశుధ్య కార్మికులు కరోనా టీకాలు వేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు