జగిత్యాల : సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండల కిష్టంపేట్ గ్రామానికి చెందిన చల్ల సత్యనారాయణకి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 60వేల రూపాయల విలువగల చెక్కు, జగిత్యాల పట్టణానికి చెందిన బి శ్రీనివాస్కు 60 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుపేదలకు కష్టకాలంలో సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ పేదలకు వైద్య సేవలు భారం కావొద్దనే పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ను అందజేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీలు రాజేంద్రప్రసాద్, సంధ్యారాణి, కౌన్సిలర్ రాజ్ కుమార్, రాయికల్ మండల కో ఆప్షన్ సభ్యుడు ముకీద్, సర్పంచ్ జీవన్ రెడ్డి,నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.