Chigurumamidi |చిగురుమామిడి, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత దాదాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, సుందరగిరి, నవాబుపేట, కొండాపూర్,ముదిమాణిక్యం, ఓగులాపూర్, ఇందుర్తి గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘ నాయకులు, గ్రామస్తులు పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. దేశంలో అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనిదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించాడని అన్నారు.
ఈ వేడుకల్లో ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, వివిధ పార్టీల అధ్యక్షులు మామిడి అంజయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి, పోలోజు సంతోష్ కుమార్, మాజీ సింగిల్ విండో చైర్మన్లు జంగ వెంకటరమణారెడ్డి, చిట్టిమల్ల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీలు అందె స్వామి, గీకురు రవీందర్, ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘ నాయకులు పాల్గొన్నారు.