కోస్గి, జూన్ 5 : కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున మార్కెట్లలో జనం మధ్యన ఎక్కువగా తిరిగే వ్యాపారులంతా తప్పకుండా టీకా తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ శిరీష అన్నారు. శనివారం కోస్గి ప్రభుత్వ దవాఖానలో వ్యాపారులకు టీకా వేశారు. కరోనా నుంచి ఎంతో మంది నిరుపేదలు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారన్నారు. మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే టీకా తప్పక తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.