కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రెలు బుధవారం స్థల పరిశీలన జరిపారు. ప్రభుత్వ కళాశాలలోని డైరీ కళాశాల స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 40 ఎకరాల స్థలం మెడికల్ కళాశాలకు అనువుగా ఉంటుందని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కళాశాల కోసం సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు కళాశాలకు స్థల సేకరణ చేపట్టాలని ఆదేశించడంతో వారు స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ కళాశాలలో ఎంత మేర భూములు సానుకూలంగా ఉన్నాయో నివేదిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్కు ప్రభుత్వ విప్ సూచించారు.
జాతీయ రహదారికి సమీపంలో, జిల్లా కేంద్రానికి అనుకూలంగా ప్రభుత్వ కళాశాల స్థలం అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియాచంద్రశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే ముజిబుద్దీన్, రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జుకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మామిండ్ల అంజయ్య, కుంబాల రవీ యాదవ్, , కాసర్ల స్వామి, బల్వంత్ రావు, చెలిమెల భానుప్రసాద్, నారాగౌడ్, కొత్తింటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.