ముమ్మరంగా శానిటైజేషన్ పనులు
విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు
మోపాల్(ఖలీల్వాడి)/కోటగిరి/మోస్రా(చందూర్)/సిరికొండ/రెంజల్/నవీపేట, ఆగస్టు 26 : కరోనా వ్యాప్తి కారణంగా మూతబడిన ప్రభుత్వ పాఠశాలలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 30వ తేదీలోగా పాఠశా లలను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలని పంచా యతీ రాజ్ శాఖను ప్రభుత్వం ఆదే శించింది. పారిశుద్ధ్య, శానిటేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలోని పలు చోట్ల అధికారులు విద్యార్థుల తల్లిదండ్రుల తో గురువారం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశా రు. మోపాల్ మండలం మంచిప్ప, ముదక్పల్లి, నర్సింగ్పల్లి, బోర్గాంలోని జడ్పీహెచ్ ఎస్ను డీఈవో దుర్గాప్రసాద్ సందర్శించారు. శానిటైజేష న్ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. కోటగిరి మండ లం పొతం గల్, కొడిచెర్ల గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులతో ఎంఈవో నాగ నాథ్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, పాఠశాలల్లో శానిటై జర్లను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థు లు కొవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. సర్పంచులు పుష్పలత, వర్ని శంకర్, ఎంపీటీసీ కేశ వీరేశం, ఏఎంసీ చైర్మన్ జుమ్మాఖాన్, హెచ్ ఎంలు తదితరులు పాల్గొన్నా రు. చందూర్, మోస్రా మండల కేంద్రాల్లో నిర్వ హించిన సమావేశాల్లో ఎంపీడీవోలు నీలావతి, భారతి పాల్గొని అవగాహన కల్పించారు. సర్పంచులు సాయారెడ్డి, నరేందర్, శేఖర్, మాధ వరెడ్డి, గణేశ్, గంగాధర్, హెచ్ఎంలు పాల్గొన్నా రు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ ప్రభుత్వ పాఠశాలను ఎంపీపీ మలావత్ సంగీత సందర్శిం చారు. శానిటేషన్ పనులు చేపట్టాలని, పిచ్చిమొక్కలను తొలగిం చాలన్నారు. అనంత రం ల్యాబ్, లైబ్రరీని పరిశీలించి వివరాలు తెలుసుకు న్నారు. ఆమెవెంట సర్పంచ్ గంగదా స్, ఎంపీటీసీ చిన్న గంగు, ఎంపీడీవో లక్ష్మీప్రసా ద్ తదితరులు పాల్గొన్నారు.
రెంజల్లో నిర్వహించిన సమావేశంలో ఎంపీడీవో గోపాలకృష్ణ అవగా హన కల్పించారు. నవీపేట మండలకేంద్రంతోపాటు రాంపూర్, ఫత్తేనగర్ గ్రామాల్లో ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ అవగాహన కల్పించారు.