ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని లయన్స్క్లబ్ భవనంలో ఆదివారం డయాబెటిక్ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో డాక్టర్లు వంశీకృష్ణ, రమ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమున్న వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్క్లబ్ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్కుమార్ మాట్లాడుతూ లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డయాబెటిక్ శిబిరాలను అందరూ సద్వినియోగ పర్చుకోవాలన్నారు.
ప్రతినెలలో రెండో ఆదివారం డయాబెటిక్ శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నివేదిత ఇన్స్టిట్యూట్ బాధ్యుడు మైలారం బాలు, ప్రాజెక్టు చైర్మన్ హరినారాయణ, లియో క్లబ్ అధ్యక్షుడు నితిన్కుమార్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.