జయశంకర్ భూపాలపల్లి : ప్రభుత్వం తరఫున అందిస్తున్న బ్యాంకింగ్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ను చిట్యాల మండలంలో ప్రారంభించారు. అలాగే రైతుల సౌకర్యార్థం 500 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణ పనుల కోసం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేట్ పరమైన బ్యాంకింగ్ రంగంలో కాకుండా రైతులు ప్రభుత్వం తరపున కోనసాగుతున్న సహకార బ్యాంకు సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మహిళా సంఘాలకు రుణం తోపాటు వారు తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించాలన్నారు. చిట్యాల మండల కేంద్రంలో బ్యాంక్ను ప్రారంభించడంతో ఇక్కడి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బ్యాంక్ లో కేవలం రుణాల విషయమే కాకుండా మహిళా సంఘాల విషయంలో పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఈ బ్యాంక్ రుణాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.