దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్గా మూడోసారి..
జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్22(నమస్తేతెలంగాణ): తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్గా డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి బుధవారం మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, వికలాంగుల సహకార సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెం జ్లో భాగంగా సంస్థ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వా సుదేవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్గా మూడో సారి బాధ్యతలను అప్పగించిన ము ఖ్యమంత్రికి రుణపడి ఉంటానని, ఆయనకు దివ్యాంగుల తరపున ధన్యవా దాలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మేకల గొర్రెల సహకార సంస్థ చైర్మన్ బాలరాజు, సోషల్ మీడియా కన్వీనర్ ఏరువ సతీ శ్రెడ్డి, సంస్థ ఎండీ శైలజ, జీఎం ప్రభంజన్రావు పాల్గొన్నారు.