బెంగళూరు, మే 8: రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీజేపీ కర్ణాటక శాఖ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వివాదాస్పద వీడియోకు సంబంధించి బెంగళూరు పొలీసులు బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయకు సమన్లు జారీచేశారు. వారం రోజుల్లో బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసుస్టేషన్లో విచారణకు రావాలని వారిద్దరిని కోరినట్టు తెలిపారు.
కర్ణాటక బీజేపీ సోషల్ మీడియాలో చేసిన పోస్టు.. ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయకూడదని ఎస్సీ, ఎస్టీలను బెదిరించేలా ఉన్నదని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి జేపీ నడ్డా, మాలవీయతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.