ముంబై: డబ్బు ఇస్తే ఈవీఎం మార్చేస్తానంటూ ఓ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించిన ఆర్మీ జవానును పోలీసులు అరెస్ట్ చేశారు. శివసేన (యూబీటీ) నేత, మహారాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబదాస్ దన్వే ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.
ఈవీఎంలను తారుమారు చేయడానికి దన్వేను ఆర్మీ జవాన్ మారుతి ధక్నే (42) రూ.2.5 కోట్లు లంచం అడిగారు. రూ.1.5 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.