పుణే: మహారాష్ట్రలోని బారాబంకి లోక్సభ నియోజకవర్గంలో ఓ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)కు పూజలు చేసినందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలీ చకంకర్పై కేసు నమోదైంది.
ఆమె, మరో ఏడుగురు ఖడక్వస్ల సెగ్మెంట్లోని పోలింగ్ బూత్లోనికి వీరు ప్రవేశించి, ప్రిసైడింగ్ అధికారి ఆదేశాలను ధిక్కరించి, ఈవీఎంకు పూజలు చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. మే 7న జరిగిన పోలింగ్ సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.