హనుమకొండ, సెప్టెంబర్ 27: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటపటిమ యువతరానికి స్ఫూర్తిదాయకమని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. లక్ష్మణ్బాపూజీ 106వ జయంతిని పురసరించుకొని సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్ తరుణ్జోషి బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మణ్బాపూజీ సబ్బండ వర్గాల ప్రజల కోసం జీవితాంతం పోరాటం చేశారని గుర్తుచేశారు. లక్ష్మణ్ బాపూజీ పోరాటయోధుడిగా కీర్తి గడించారని ఆమె తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకుసాగాలని సుధారాణి పిలుపునిచ్చారు.
దేశసేవకే అంకితం..
తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసిన గొప్ప వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్ అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమకారుడిగా, తెలంగాణ రైతాంగ పోరాట యోధుడిగా, తొలి, మలి దశల తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కర్తగానే కాకుండా గొప్ప న్యాయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. తెలంగాణ ప్రజల కోసం తన ఆస్తులను ధారపోసి 96 ఏళ్ల వయసులో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేసిన గొప్ప తెలంగాణవాది అని గుర్తుచేశారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్ముంతు మాట్లాడుతూ లక్ష్మణ్ బాపూజీ భావితరాలకు స్ఫూర్తిప్రదాత అన్నారు. కార్యక్రమంలో హనుమకొండ అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఆర్డీవో ఏ శ్రీనివాస్కుమార్, డీఆర్వో ఎం వాసుచంద్ర, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, బీసీ వెల్ఫేర్ అధికారి రాంరెడ్డి, జిల్లా అధికారులు, బీసీ సంఘం నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
సుబేదారి: కొండా లక్ష్మణ్బాపూజీ జయంతిని వరంగల్ పోలీసు కమిషనరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్జోషి లక్ష్మణ్బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈస్ట్జోన్, సెంట్రల్ జోన్ డీసీపీలు వెంకటలక్ష్మి, పుష్పారెడ్డి, అదనపు డీసీపీ భీంరావు, ఏఆర్ ఏసీపీ సదానందం, ఆర్ఐ భాస్కర్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్కుమార్ ఉన్నారు.
హనుమకొండ సిటీ: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్రావు పాల్గొని లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులల్పించారు. కార్యక్రమంలో హెచ్ఆర్డీ డైరెక్టర్ డీ వెంకటేశ్వరరావు, ఆపరేషన్స్ డైరెక్టర్ పీ గణపతి, పీఅండ్ఎంఎం డైరెక్టర్ నరసింహారావు, కమర్షియల్ డైరెక్టర్ సంధ్యరాణి పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ కలలను సాకారం చేద్దాం
న్యూశాయంపేట: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కలలను సాకారం చేద్దామని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ పిలుపునిచ్చారు. హనుమకొండ హంటర్రోడ్లోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవన్లో లక్ష్మణ్ బాపూజీ 106 జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్, మేయర్ సుధారాణి, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, కార్పొరేటర్ మామిండ్ల రాజు హాజరై బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి దాసరి ప్రేమ్సాగర్, గౌరవ సలహాదారుడు వేముల సదానందం, మంచికట్ల జనార్దన్, చందా మల్లయ్య, వెల్దండి గణేశ్, కుసుమ శ్యామ్, సాయిరాం ఆనంద్, గణకుడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.