హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 18: నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో వివిధ రాష్ర్టాలకు చెందిన క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ అన్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో గెలుపొందిన అథ్లెట్లకు శనివారం ఆయన మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ.. వరంగల్లో ఇంతపెద్దఎత్తున నేషనల్స్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో ఎంతోమంది అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపి పతకాలు సొంతం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీ తరుణ్జోషి, డీవైఎస్వో గుగులోత్ అశోక్కుమార్, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వర్రావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.