వ్యవసాయ యూనివర్సిటీ(హైదరాబాద్), సెప్టెంబర్ 16: ప్రతినీటి బొట్టునూ ఒడిసిపట్టి సాగులో గణనీయమైన మార్పులు తీసుకొచ్చేం దుకు మనమంతా కృషిచేయాలని, రైతుకు ఎంత అండగా ఉంటే దేశంలో అంత మార్పు సాధ్యమ వుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యద ర్శి ఎస్కే పట్నాయక్, సీహెచ్ఏఐ ఛైర్మన్ డా. హెచ్ పీ సింగ్ అన్నారు. గురువారం రాజేందర్నగర్లో ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రి కల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఫర్ డ్రాప్, మోర్ క్రాప్ (ప్రతి నీటి బొట్టుకూ ఎ క్కువ పంట ) సమావేశానికి వారు ముఖ్య అతిథు లుగా పాల్గొని మాట్లాడారు. భారతదేశం అతి త్వరలోనే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్పీ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా సంక్షోభం తప్పదన్నా రు. పెరుగుతున్న జనాభా కారణంగా తలసరి నీటి వినియోగం తగ్గుతోందన్నారు. దీనిపై అందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైం దన్నారు. వర్సిటీని జాతీయ స్థాయిలో అగ్రస్థానం లో నిలబెట్టడానికి ఉపకులపతి ప్రవీణ్రావు ఎంతో కృషిచేశారని పట్నాయక్ అభినందించారు. వ్యవసాయ ఉత్పాదకత విషయంలో నీటిది కీలక పాత్ర అన్నారు.
ఈ సందర్భంగా ఏఎస్ఎం ఫౌండే షన్ వివిధ అవార్డులు ప్రకటించింది. వర్సిటీ ఉపకులపతి ప్రవీణ్రావు గత కొన్నాళ్లుగా వ్యవసా య రంగానికి మైక్రోఇరిగేషన్లో చేస్తున్న కృషికి గుర్తింపుగా అవార్డు అందుకున్నారు. వీసీ ప్రవీణ్ రావు మాట్లాడుతూ 2014లో తెలంగాణ ప్రభు త్వం అనతి కాలంలోనే సాగు నీటి సౌకర్యం పెద్ద ఎత్తున కల్పించిందన్నారు. దాని కారణంగా వ్యవ సాయ హార్టికల్చర్ పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. నేడు తెంగాణ దేశానికే ధాన్యాగా రంగా మారిందని ఎఫ్సీఐ సైతం ధ్రువీకరించిం దన్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో వ్యవసాయ పరిశోధనలకు రూ. 100 కోట్లు కేటాయించింద న్నారు. అయితే నూనె గింజల ఉత్పత్తిలో ఇంకా వెనుకబడే ఉందని పేర్కొన్నారు.
వాతావరణ మా ర్పులు, పంటల వైవిధ్యం, వ్యవసాయ యాంత్రీక రణ, ఎరువులు సరైన వినియోగం తదితరాలు నేడు మన ముందున్న ప్రధాన సవాళ్లని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్ర భుత్వం ప్రపంచం అబ్బురపడే విధంగా స్వల్ప కా లంలోనే కృష్ణ, గోదావరి నదులపై అనేక ప్రాజెక్టు లను పూర్తి చేసి తాగు, సాగు నీరు అందిస్తున్నదని గుర్తు చేశారు. నీటి వనరులు తక్కువగా ఉన్న చోట సైతం ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆన్, ఆఫ్లైన్లో జాతీయ స్థాయి వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, పారి శ్రా మిక రంగ ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యాన కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. పలువురికి అవార్డులు అందజేశారు.