పెద్దవంగర, సెప్టెంబర్14: దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఉద్యమ తరహాలో అమలు చేస్తున్నామని రాష్ట్ర పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లా డారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబా నికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామ ని అన్నారు. రాష్ట్రంలో దళితబంధు వలె అన్ని వర్గాల ప్రజలకు పథకాలను అందించే యోచన లో సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. దళితబంధు పథకం కోసం ప్రతి సంవత్సరం రూ. 25 వేల కోట్లు కేటాయిస్తున్నా మని అన్నారు.
ఈ పథకం ప్రపంచ దేశాలకు ఆద ర్శమని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చె ప్పారు. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కూ తగిన గుర్తింపునిస్తున్నామని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన పెద్దవంగర మండల అభివృద్ధికి, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. అందరి సహకారం, సమన్వయంతో పనిచేస్తే అన్ని విధాలా అభివృద్ధి చెంది ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ కమిటీలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందుచూపుతో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగ తి కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. దీనికి ఎన్నో అవార్డులను కేంద్రం అందించిందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు ఐలయ్య, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు నెహ్రూనాయ క్, ఏఎంసీ మాజీ చైర్మన్ సోమనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు యాదగిరిరావు, ప్రధాన కార్యదర్శి సంజయ్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ, ఏఈలు శ్రీనివాస్రావు, యాకూబ్, టీఆర్ ఎస్ నాయకులు సమ్మయ్య, వెంకన్న, రాము, రవి, పూల్సింగ్, సీతారాంనాయక్ ఉన్నారు.