వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు 6 లక్షల రూపాయల విలువగల నిధులు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.. ఈ చెక్కులను పట్టణంలోని వివిధ వార్డులలో లబ్దిదారుల ఇండ్లకు స్వయంగా వెళ్లి మరీ అందజేస్తున్నారు.
జగిత్యాల పట్టణంలోని 01, 04, 06, 07, 12, 15, 20, 40 వార్డుల్లో 14 మంది లబ్దిదారులకు సుమారు రూ.6.20 లక్షల విలువగల నిధులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ శ్రావణి ప్రవీణ్ స్వయంగా లబ్దిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు కొలగాని ప్రేమలత, సత్యం, వల్లెపు రేణుక మోగిలి, కుసరి అనిల్, క్యాదాసు నవీన్, తోట మల్లికార్జున్, అవారి శివకేసరి బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావ్, కౌన్సిలర్లు , తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.