జగిత్యాల: జిల్లాలోని వెల్దుర్తిలో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. జగిత్తాల రూరల్ మండలంలోని వెల్దుర్తిలో ఉన్న ఓ మురుగకాలువలో వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని బిరుదుల హన్మక్క (65)గా గుర్తించారు. గ్రామంలో ఆమె వడ్డీ వ్యాపారం చేస్తున్నదని వెల్లడించారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.