Israel-Gaza War | అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ (Hamas) మిలిటెంట్లు మెరుపు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం ఉధృతంగా సాగుతోంది. ఈ యుద్ధంలో రెండు వైపులా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇక హమాస్ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. భూతల, వాయు, జల మార్గాల్లో హమాస్ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలో హమాస్తో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు.
మరోవైపు యుద్ధం విషయంలో హమాస్ సైతం అదే పదం పాడుతోంది. ఇజ్రాయెల్పై తమ దాడుల్ని సమర్థించుకుంటోంది. ఈ క్రమంలోనే హమాస్ ప్రతినిధి ( Hamas leader) ఘాజీ హమాద్ (Ghazi Hamad) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇజ్రాయెల్కు గుణపాఠం చెప్పేందుకు మళ్లీ మళ్లీ ఇలాంటి దాడులే చేస్తామంటూ ఆయన తేల్చి చెప్పారు. గత నెల 24వ తేదీన ఆయన లెబనాన్ టీవీ ఛానెల్కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను సదరు ఛానెల్ తాజాగా బయటపెట్టింది.
ఆ ఇంటర్వ్యూలో ఘాజీ హమాద్ మాట్లాడుతూ.. ‘ఇజ్రాయెల్పై దాడి చేసినందుకు మేం సిగ్గు పడట్లేదు (not ashamed). ఇజ్రాయెల్కు గుణపాఠం నేర్పాలనుకున్నాం కాబట్టే దాడులు చేశాం. మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటాం. ఆ దేశాన్ని సమూలంగా నాశనం చేసే వరకూ దాడులు ఆపే ప్రసక్తే లేదు. పాలస్తీనా భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటాం. అప్పటి వరకూ పోరాడుతూనే ఉంటాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్ను పూర్తిగా అంతమొందించాలన్నదే తమ లక్ష్యం అని ఆయన వెల్లడించారు. హమాస్ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా అందుకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. పౌరుల ప్రాణాలు తీయడం తమ ఉద్దేశం కాదని అన్నారు. ‘ఇజ్రాయెల్ని పూర్తిగా అంతమొందించాలన్నదే మా లక్ష్యం. పౌరులపై దాడులు చేయాలన్నది మా ఉద్దేశం కానేకాదు. గ్రౌండ్ అటాక్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమరవీరుల దేశంగా పాలస్తీనా పేరొందింది. దేశం కోసం అమరులయ్యేందుకు ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన అన్నారు.
అసలు ఇజ్రాయెల్ ఉనికే అనైతికమని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ కారణంగానే ఇంత హింస జరుగుతోందని.. రక్తం పారుతోందని, ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అన్నారు. ‘ఇజ్రాయెల్ ఆక్రమణలకు మేం బాధితులుగా మారిపోయాం. కాబట్టి, మమ్మల్ని నిందించకూడదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పై జరిపిన దాడి (ఆల్ అక్సా ఫ్లడ్) ప్రారంభం మాత్రమే. ఇకపైనా దాడులు కొనసాగిస్తాం. రెండు, మూడు, నాలుగు.. ఇలా దాడులు కొనసాగుతూనే ఉంటాయి’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే, అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి చొరబడి హమాస్ మిలిటెంట్లు జరిపిన దారుణ ఊచకోతపై, సామాన్యుల మరణాలపై స్పందించాలని టీవీ యాంకర్ పదేపదే ప్రశ్నించగా.. ఘాజీ హమాద్ ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
🚨 Breaking: Hamas leader Ghazi Hamad says they will repeat October 7-like massacres until Israel is annihilated.
Now you understand why Israel must annihilate Hamas…pic.twitter.com/XaE973dzRr
— Dr. Eli David (@DrEliDavid) November 1, 2023
Also Read..
Hacking Row | ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై యాపిల్కు నోటీసులు ఇచ్చిన కేంద్రం
Karwa Chauth | కర్వాచౌత్ వేడుకల్లో మెరిసిన తారలు.. ఫొటోలు వైరల్