Hacking Row | దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ (Phone Hacking) వ్యవహారం కలకలం రేపింది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు (Opposition Leaders) మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. పలువురు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి ఒకేసారి ‘హ్యాకింగ్ అలర్ట్’ సందేశాలు రావడం సంచలనంగా మారింది.
ఈ అంశంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ.. యాపిల్ (Apple) సంస్థకు గురువారం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు హ్యాకింగ్కు ప్రయత్నిస్తున్నట్లు ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది. తమ నోటీసులపై వెంటనే స్పందించాల్సిందిగా యాపిల్ సంస్థను మంత్రిత్వ శాఖ కోరింది. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎన్.కృష్ణన్ ధ్రువీకరించారు. మరోవైపు హ్యాకింగ్ ఆరోపణలపై భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Also Read..
Karwa Chauth | కర్వాచౌత్ వేడుకల్లో మెరిసిన తారలు.. ఫొటోలు వైరల్
Ram Charan | ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లోకి చేరిన రామ్చరణ్.. ప్రకటించిన అకాడమీ